ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్

ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్

నల్గొండ, ఖమ్మం, వరంగల్​ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పై పార్టీ వర్గాల్లో  చర్చ

రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠ

సిట్టింగ్ ఎమ్మెల్సీ ‘పల్లా’నే మళ్లీ పోటీ చేస్తారనే ప్రచారం

కొత్త అభ్యర్థిని నిలబెడితే తలెత్తే పరిణామాల పైన తర్జనభర్జన

నియోజకవర్గాల్లో ఉధృతంగా సాగుతున్న ఓటరు నమోదు

నల్గొండ, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? అనే సస్పెన్స్​ కొనసాగుతోంది. హైకమాండ్​ ఆదేశాలతో ఓ టరు నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా సాగిస్తున్న ఎమ్మెల్యేలలోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రూలింగ్​ పార్టీ, ఎక్కడికక్కడ ఇన్​చార్జిలను  నియమించి గ్రామాల్లో, పట్టణాల్లో గ్రాడ్యుయేట్ల కోసం జల్లెడపడుతోంది.  ఈక్రమంలో ఓటరు నమోదు చేపడుతున్న లీడర్లు, క్యాడర్​కు ‘ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?’ అనే ప్రశ్న గ్రాడ్యుయేట్ల నుంచి వస్తోంది. దీని పైన హైకమాండ్​ కూడా క్లారిటీ ఇవ్వకపోడంతో మౌనంగా దాటవేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ వద్ద జరిగిన మీటింగ్​లో, అంతకుముందు ఓటరు నమోదు ప్రారంభానికి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద జరిగిన సమావేశంలోనూ అభ్యర్థి అంశం పైనే చర్చ జరిగినట్లు తెలిసింది. కానీ ఇప్పటి వరకు హైకమాండ్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పార్టీ వర్గాల్లో మా త్రం సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే మళ్లీ నిలబెడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నల్గొండ, వరంగల్​ జిల్లాల్లో పల్లా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు మాత్రం కొత్త అభ్యర్థి అయితే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చే స్తున్నారు. ఈక్రమంలో కొత్త అభ్యర్థిని నిలబెడితే తలెత్తే పరిణామాల పై హైకమాండ్​ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

అభ్యర్థి పై వేచిచూసే ధోరణి..

గ్రాడ్యుయేట్ ఎలక్షన్​లో పోటీ చేయాలనుకుంటున్న టీజేఎస్, యువ తెలంగా ణ పార్టీ, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐ నేతలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఓటరు నమోదు చేపట్టారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా వల్ల  గ్రాడ్యుయేట్లకు ఒరిగిందేమీ లేదని ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నాడి అర్థం కాని టీఆర్​ఎస్​ హైకమాండ్​ తన అభ్యర్థిపై ఆచితూచి అడుగులు వేస్తోంది.  గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందనే విషయాన్ని పసిగట్టడం వల్లే పల్లా రాజేశ్వర్​రెడ్డి పేరును ప్రకటించేందుకు తర్జనభర్జన పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అనుభవాలతో విపక్ష పార్టీల కంటే ముందుగానే అలర్ట్​ అయ్యి ఓటరు నమో దు చేపడుతున్న టీఆర్ఎస్,  అభ్యర్థిని ప్రకటించే విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ పల్లానే నిలబెట్టాలనే ఆలోచనలో హైకమాండ్​ ఉన్నట్లు లీడర్ల టాక్​.

ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత..

ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేల్లో పలువురు పల్లాకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. హైకమాండ్​కు నమ్మినబంటుగా ఉన్న పల్లా రాజకీయంగా పట్టుసంపాధించేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చారని మొదటి నుంచీ అనుమానిస్తున్నారు.  ఈ ఏడాది డీసీసీబీ చైర్మన్ ఎంపికలో పల్లా వ్యవహరిం చిన తీరు నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కోపం తెప్పించింది. గతేడాది జరిగిన హుజూర్​నగర్ ఉప ఎన్నికలు, నల్గొండ మున్సిపల్ చైర్మ న్ ఎన్ని క బాధ్యతలు కూడా హైకమాండ్​ పల్లాకే అప్పగించింది. దీంతో జిల్లాలో పల్లాకు బలం పెరుగుతుందనేది అక్కడి నేతల భావన. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లానే నిలబెట్టాలనే ఆలోచన హైకమాండ్​ కు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే దాని రిజల్ట్ మరోరకంగా ఉంటుందనేది పార్టీ ఆలోచన.

For More News..

గోదావరిలో మిగులు నీళ్లన్నీ మావే!