మొత్తానికే పైసలియ్యం…సభ్యత్వం నుంచి వైదొలుగుతాం

మొత్తానికే పైసలియ్యం…సభ్యత్వం నుంచి వైదొలుగుతాం
  • నెల రోజుల్లో డబ్ల్యూహెచ్ఓ లో రిఫార్మ్స్ జరగాలి
  • టెడ్రోస్ ను హెచ్చరిస్తూ లెటర్ రాసిన ట్రంప్

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా డ్యామేజీ అయిన అమెరికా అందుకు చైనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) నే కారణమని తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు డబ్ల్యుహెచ్ఓ పై ఆరోపణలు చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా ఆ సంస్థ కు అల్టిమేటం జారీ చేశారు. నెల రోజుల్లో డబ్ల్యుహెచ్ఓ లో రిఫార్మ్ జరగాల్సిందేనంటూ సంస్థ చీఫ్ టెడ్రోస్ కు ‘సెల్ఫ్‌ ఎక్స్‌ప్లెనెటరీ’ పేరుతో లెటర్ రాశారు. లేదంటే ఆ సంస్థ కు ఇచ్చే నిధులను పూర్తిగా అపేస్తామంటూ లెటర్ లో హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా ఇవ్వాల్సిన నిధులను అపేసింది. తాజాగా పూర్తిగా నిధులను ఆపేస్తామని డబ్ల్యూహెచ్ ఓ లో సభ్యత్వం కొనసాగించాలా వద్దా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ” కరోనా విషయంలో మీరు, మీ సంస్థ ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించింది. దీనికి ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ లో ఉండకూడదంటే చైనాను వదిలేసి…స్వతంత్రంగా పనిచేయండి ” అంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ను ఉద్దేశించి లెటర్ లో ట్రంప్ పేర్కొన్నారు. రిఫార్మ్ కు సంబంధించి ఇప్పటికే అమెరికా అధికారులు టెడ్రోస్ తో చర్చలు ప్రారంభించారు. ఐతే టైం వేస్ట్ చేయటం తనకు ఇష్టం లేదని నెల రోజుల్లో ఆర్గనైజేషన్ లో పెద్దఎత్తున మార్పులు జరగాలని ట్రంప్ కోరారు. కరోనా మొదలైన కొత్తలోనే చైనా నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను నిలిపివేస్తే వద్దని చెప్పినా టెడ్రోస్…చైనా లో డొమెస్టిక్ ఫ్లైట్స్ ను రద్దు చేస్తే మాత్రం కరోనా కట్టడిలో ఆ దేశం కఠినంగా వ్యవహారించిందంటూ ఎలా ప్రశంసించారని ప్రశ్నించారు. కరోనా పుట్టుక, వ్యాప్తి గురించి డబ్ల్యూహెచ్ఓ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించటాన్ని ట్రంప్ స్వాగతించారు. వీలైనంత తర్వగా నివేదిక రావాల్సిన అవసరం ఉందన్నారు. టెడ్రోస్ రాసిన లేఖను ట్రంప్ ట్విట్టర్ లో షేర్ చేశారు.