తెలంగాణలో కొత్త కేసులు 767, మరణాలు 2

తెలంగాణలో కొత్త కేసులు 767, మరణాలు 2

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో  కొత్త కేసులు 767, మరణాలు 2 నమోదయ్యాయి. మొత్తం 58 వేల 749 మందికి పరీక్షలు చేయగా 767 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో వైపు 2 వేల 861 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే మరో 17 వేల 754 మందికి కరోనా సోకడంతో ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. మరో 1,590 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 97.20 శాతం రికవరీ రేటు నమోదయ్యింది. 
 

ఇవి కూడా చదవండి

సినీ పరిశ్రమను ఏపీకి తరలించండి

ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ

తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం