
టాలీవుడ్ సినీ పరిశ్రమను ఏపీకి తరలించాలని సీఎం జగన్ అన్నారు. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై ఇవాళ సినీ పెద్దలు చిరంజీవి, రాజమౌళి, మహేశ్, ప్రభాస్, పోసాని, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, అలీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. పరిశ్రమలోని సమస్యలపై చర్చించారు. అయితే ఈ సందర్బంగా విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలు కేటాయిస్తామని..సినీ ఇండస్ట్రీ ఏపీకి వచ్చేలా దృష్టిపెట్టాలని వాళ్లకు సూచించారు జగన్. స్టూడియోలు పెట్టుకోవడానికి ఇళ్లకు, విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. హైదరాబాద్ లో విశాఖ పోటీపడగలదన్నారు. దీనికి ముందడుగు పడాలంటే సినీ ఇండస్ట్రీ ముందుకు రావాలని అన్నారు.