భైంసాలో లైంగిక దాడిపై స్పందించిన డీజీపీ

భైంసాలో లైంగిక దాడిపై స్పందించిన డీజీపీ
  • కేసు విచారణ మహిళా పోలీసు విభాగానికి అప్పగింత

హైదరాబాద్: నిర్మల్ జిల్లా బైంసాలో లైంగిక దాడి ఉదంతం పై డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి స్పందించారు. కేసు విచారణ మహిళా పోలీసు విభాగానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కోర్టులో ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పరంగా గుర్తించి, నిందితులకు తగు శిక్ష పడేవిధంగా దర్యాప్తు ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సంఘటను సీరియస్ గా తీసుకున్న డీజీపీ దర్యాప్తును నిస్పాక్షికంగా, త్వరిత గతిన పూర్తిచేసి, నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు.  బాధిత బాలికకు  వైద్య సహాయం అందించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు తగు ఆర్థిక  సహాయాన్ని సంబంధిత ప్రభుత్వ  శాఖలతో సమన్వయం చేసి బాధితులకు అందేలా కృషిచేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో మహిళా భద్రతా విభాగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుందని ఒక ప్రకటనలో డీజీపీ తెలియ జేశారు.