
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలకు ఈ నెల 31 వరకు సెలవులను ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. శనివారం సీఎం నేతృత్వం లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారనే సమాచారం. అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన సమావేశంలో.. ఈ నెలఖారు వరకు థియేటర్లు. ఫంక్షన్ హాల్స్ , స్కూల్స్ , కాలేజీలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి.