టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా నవీన్​ నికోలస్

టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా నవీన్​ నికోలస్

హైదరాబాద్, వెలుగు:  టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఈ. నవీన్​ నికోలస్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఉన్న అనితా రామచంద్రన్​ను పంచాయతీరాజ్​అండ్​రూరల్​డెవపల్​మెంట్​కమిషనర్ గా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్​శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐ అండ్​ పీఆర్​కమిషనర్​గా హనుమంతరావును నియమించారు.

ఈ ప్లేస్​లో ఇప్పటి వరకు పని చేస్తున్న కె.అశోక్​ రెడ్డిని హార్టికల్చర్​ డైరెక్టర్ గా పంపారు. తెలంగాణ సోషల్, ట్రైబల్​వెల్ఫేర్​ గురుకులాల సెక్రటరీగా కె. సీతా లక్ష్మీకి పోస్టింగ్​ ఇచ్చారు. ఇక సివిల్​సప్లయ్స్​డైరెక్టర్​గా వీఎస్​ఎన్​వి ప్రసాద్​ (ఐఎఫ్​ఎస్​) ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం జూపార్క్స్​డైరెక్టర్​గా విధలు నిర్వహిస్తున్నారు.