
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ సెక్రటరీగా ఈ. నవీన్ నికోలస్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఉన్న అనితా రామచంద్రన్ను పంచాయతీరాజ్అండ్రూరల్డెవపల్మెంట్కమిషనర్ గా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐ అండ్ పీఆర్కమిషనర్గా హనుమంతరావును నియమించారు.
ఈ ప్లేస్లో ఇప్పటి వరకు పని చేస్తున్న కె.అశోక్ రెడ్డిని హార్టికల్చర్ డైరెక్టర్ గా పంపారు. తెలంగాణ సోషల్, ట్రైబల్వెల్ఫేర్ గురుకులాల సెక్రటరీగా కె. సీతా లక్ష్మీకి పోస్టింగ్ ఇచ్చారు. ఇక సివిల్సప్లయ్స్డైరెక్టర్గా వీఎస్ఎన్వి ప్రసాద్ (ఐఎఫ్ఎస్) ను ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం జూపార్క్స్డైరెక్టర్గా విధలు నిర్వహిస్తున్నారు.