బాలుడిపై వీధి కుక్కల దాడి కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

బాలుడిపై వీధి కుక్కల దాడి కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఒ బాలుడు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా రేపు ఈ కేసు హైకోర్టులో విచారణ జరగనుంది. అంబర్ పేట్ లో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

బాగ్ అంబర్ పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు.