హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ స్ర్టీమ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం ఫస్ట్ సెషన్ లో 34,507 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 32,656 మంది హాజరయ్యారు. రెండో సెషన్లో 34242 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 32,464 మంది హాజరయ్యారని ఎంసెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఓ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి సెల్ ఫోన్ తో పట్టుబడడంతో అతనిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని తెలిపారు. శని, ఆదివారం కూడా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.