ఎంసెట్ ఇంజినీరింగ్​కు 94 శాతం హాజరు

ఎంసెట్ ఇంజినీరింగ్​కు 94 శాతం హాజరు

హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్  స్ర్టీమ్  ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం ఫస్ట్ సెషన్ లో 34,507 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 32,656 మంది హాజరయ్యారు. రెండో సెషన్​లో 34242 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 32,464 మంది హాజరయ్యారని ఎంసెట్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఓ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి సెల్​ ఫోన్​ తో పట్టుబడడంతో అతనిపై మాల్ ప్రాక్టీస్  కేసు నమోదు చేశామని తెలిపారు. శని, ఆదివారం కూడా ఇంజినీరింగ్  స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.