సంక్రాంతి నాటికి 200 కొత్త బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

సంక్రాంతి నాటికి 200 కొత్త బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ప్రయాణాకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి నాటికి కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమవుతోంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా  ప్రారం భించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోందని ఎండీ సజ్జనార్ తెలిపారు. 

హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం (డిసెంబర్ 22) కొత్త బస్సులను పరిశీలించారు ఎండీ సజ్జనార్. కొత్తగా అందుబాటులోకి తెచ్చే లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్ర్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మీ  పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని.. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సజ్జనార్. 

ప్రయాణిలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో 2వేలకు పైగా కొత్త బస్సులను  అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందులో 400 ఎక్స్ ప్రెస్ , 512 పల్లె వెలుగు , 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. 

ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి కొస్తే హైదరాబాద్ సిటీలో 540 , తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 500  బస్సులను వాడకంలోకి ఆర్టీసీ యాజమాన్యం తేనుంది. వీటన్నింటిని 2024 మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు  టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 

ఈ బస్సుల్లో గమ్యస్థానాల వివరాల కోసం బస్సు ల్లో ఎల్ ఈడీ బోర్డుల ఏర్పాటు, అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్తు సజ్జనార్ తెలిపారు.