టెన్త్ సప్లిమెంటరీలో 28,415 మంది పాస్

టెన్త్ సప్లిమెంటరీలో 28,415 మంది పాస్

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 73.35 శాతం మంది పాస్ అయ్యారు. శుక్రవారం సప్లిమెంటరీ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు రిలీజ్ చేశారు. ఈ నెల 3 నుంచి 13 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 42,834 మంది రిజిస్టర్ చేసుకోగా.. 38, 741 మంది ఎగ్జామ్స్ రాశారు. 

ఇందులో 28, 415 మంది పాసయ్యారు. అబ్బాయిలు 23,976 మందికిగానూ.. 17034 ((71.05%) మంది, అమ్మాయిలు 14,765 మందికిగానూ.. 11381 (77.08%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో జనగామ జిల్లా వంద శాతం ఉత్తీర్ణతతో టాప్ లో నిలవగా.. 55.90 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి చివరిస్థానంలో నిలిచింది.