టెట్ ఎగ్జామ్ ఫీజు వెయ్యి రూపాయలు

టెట్ ఎగ్జామ్ ఫీజు వెయ్యి రూపాయలు
  •     రెండు పేపర్లు రాస్తే రూ.2 వేలు
  •     గతంలో 400లే.. ఆన్​లైన్ ఎగ్జామ్స్​కావడంతో భారీ పెరిగిన ఫీజులు
  •     27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ 

టెట్ పరీక్ష ఫీజు రూ. వెయ్యిగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు పేపర్లు రాస్తే రూ.2 వేలు చెల్లించాలి. గతంలో ఒక్క పేపర్ ​రాసినా.. రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్​ ఫీజు రూ.400లే ఉండేది. పెంచిన ఫీజుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్, వెలుగు:  టీచర్ ఎలిజిబెలిటీ టెస్ట్ (టెట్-)–2024 పరీక్ష ఫీజు వెయ్యి రూపాలయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు పేపర్లు రాస్తే రూ.2 వేలు చెల్లించాలి. గతంలో ఒక్క పేపర్​ రాసినా.. రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్​ ఫీజు రూ.400లే ఉండేది. ప్రస్తుతం పెంచిన ఫీజును చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్​లైన్ ఎగ్జామ్ కావడంతో ఫీజును భారీగా పెంచినట్టు తెలుస్తున్నది. శుక్రవారం రాత్రి విద్యాశాఖ టెట్ డిటైల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జూన్ 12న ఫలితాలు ప్రకటిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. పూర్తి వివరాలకు https://schooledu.telangana.gov.inను చూడాలన్నారు.  అయితే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో, టీచర్లూ, ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈ సారి అవకాశం కల్పించారు.

8 భాషాల్లో పరీక్ష

పేపర్–1ను ఐదో తరగతి వరకు టీచర్​గా ఉండాలనుకునే వారికి, పేపర్​–2 ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీచర్​గా ఉండాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు. టెట్ క్వశ్చన్ పేపర్ రెండు భాషల్లో ఉంటుంది. ఇంగ్లిష్​తో పాటు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతి, తమిళం తదితర 8 భాషాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈసారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు.