ఇవాళ్టి నుంచి టీశాట్ డిజిటల్​ క్లాసులు

ఇవాళ్టి నుంచి  టీశాట్ డిజిటల్​ క్లాసులు

హైదరాబాద్, వెలుగు: స్కూల్ స్టూడెంట్లకు డిజిటల్​ పాఠాలను చెప్పేందుకు టీశాట్​సిద్ధమైంది. గురువారం నుంచి బ్రిడ్జి కోర్సు క్లాసులను ప్రారంభిస్తున్నట్టు టీశాట్ ​సీఈవో వేణుగోపాల్​రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లాసులు ప్రసారమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఆధునిక సాంకేతికతో కూడిన విద్యను అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్​ పాఠాలను ప్రసారం చేస్తున్నామని చెప్పారు. 

అందులో భాగంగా గురువారం నుంచి 30వ తేదీ వరకు క్లాసులను నిర్వహిస్తామని, ఆదివారం సెలవు ఉంటుందని తెలిపారు. మూడో క్లాస్​ నుంచి టెన్త్​ క్లాస్​ వరకు అరగంట చొప్పున నిడివి కలిగిన పాఠాలను డిజిటల్​ క్లాసుల్లో చెప్తామన్నారు. మ్యాథ్స్​, హిందీ, ఇంగ్లిష్​, సైన్స్​తో పాటు  మిగతా సబ్జెక్లుల్లో రోజుకు మూడు గంటల చొప్పున 9 రోజులు పాటు 27 గంటలు ప్రసారమవుతాయని వివరించారు. ఆఫ్​లైన్​లో రెగ్యులర్ గా టీచర్లు చెప్పే లెసన్స్​కు అనుబంధంగా ఈ డిజిటల్​ క్లాసులూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.