TSPSC గ్రూప్ 1 పరీక్ష.. మళ్లీ రద్దుకు కారణాలేంటి?

TSPSC గ్రూప్ 1 పరీక్ష.. మళ్లీ రద్దుకు కారణాలేంటి?

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ కాసేపటి క్రితమే  హైకోర్టు తీర్పు ఇచ్చింది.  పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌ - 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరోసారి గ్రూప్ 1 రద్దు కావడంతో  అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. అసలు రద్దుకు గల కారణాలేంటో ఒకసారి చూద్దాం.

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని  ఎన్‌ఎస్‌యూఐతో పాటు  పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  గ్రూప్ 1 ప్రిలిమ్స్  ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.    పిటిషన్ పై  విచారణ జరిపిన హైకోర్టు గ్రూప్ 1ను రద్దు చేస్తున్నట్లు ఇవాళ తీర్పునిచ్చింది.  పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. 

ALSO READ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..ఆందోళనలో 2 లక్షల 30 వేల మంది స్టూడెంట్స్

తెలంగాణలో 2023 జూన్ 11న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  దీనికి 2,33,506 మంది అటెండ్ అయ్యారు.