టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్... ముందస్తు రిజర్వేషన్ చార్జీలు భారీగా తగ్గింపు

టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్...  ముందస్తు రిజర్వేషన్ చార్జీలు భారీగా తగ్గింపు

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పి్ంది. ముందస్తు రిజ‌ర్వేష‌న్ చార్జీలను భారీగా త‌గ్గించింది.  ఎక్స్‌పెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో 350 కిలో మీటర్లలోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే రూ.30వసూలు చేయనుంది.  

టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న వస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు, రోజుకు సగటున 15 వేల మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారని, వారికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.  

ఈ స‌దుపాయాన్ని ప్రయాణికులంద‌రూ ఉప‌యోగించుకుని.. సంస్థను ఆద‌రించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్దన్, సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్  కోరారు.