ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు యువకులు మృతి

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు యువకులు మృతి

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్ పల్లి సమీపంలో చోటుచేసుకుంది.ఎదురుఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఆటో.. రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఆందోల్ కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ కి వచ్చిన కార్యకర్తలు.. తిరుగు ప్రయాణంలో రాంసాన్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.   ఈ  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.