హైదరాబాద్: హయత్ నగర్ లో ఓ ఆర్టీసీ బస్సు హల్ చల్ చేసింది. జనవరి 31వ తేదీ ఉదయం హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గరు దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన RTC బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పలు ఆటోలు, బైక్ లు, కార్లను ఢీకొడుతూ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళతోపాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికలు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు చెప్పారు.