హయత్ నగర్ డిపోకు చెందిన కండక్టర్ తో చిల్లర విషయంలో గొడవ జరిగింది. దీంతో ఓ మహిళ... కండక్టర్ ను కాలితో తన్ని బూతులతో రెచ్చిపోయింది. బస్సులో ఉన్న తోటి మహిళలు వద్దన్నా వినకుండా కండక్టర్ పై దాడికి దిగింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటన పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కండక్టర్ పై దాడి ఘటనను యాజమాన్యం సీరియస్ గా తీసుకుంటుందని ట్వీట్ చేశారు. వివాదంపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు సజ్జనార్.
నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. టిఎస్ఆర్టిసి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.