
ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు అనేక అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ఆర్టీసీ మరో మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ సారి వృద్ధులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది రోజున 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఈ బంపర్ ఆఫర్ ఉగాది ఒక్క రోజు మాత్రమేనని తెలిపిన సంస్థ.. ఇలాంటి ఆఫర్లతో ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపిన ఎండీ సజ్జనార్.. 2 ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో 65 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్కు ఉచితంగా ప్రయాణం అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్ కు చూపించి ఈ సదుపాయం పొందాలని తెలిపారు.
On the occasion of #Ugadi #TSRTC Offers Free Ride to Senior Citizens above 65 years only on 2nd April 2022 in all types of #TSRTCBusServices @TSRTCHQ @ntdailyonline @TV9Telugu @Eenadu_Newspapr @sakshinews @way2_news @TelanganaToday @IndiaToday @bbcnewstelugu @baraju_SuperHit pic.twitter.com/v5fUK4uOyL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 31, 2022