ఖమ్మంలో మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య

ఖమ్మంలో మరో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మె క్రమంలో మరో బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపోలో నీరజ కండక్టర్ గా పని చేస్తున్నారు. సమ్మెతో తీవ్ర మనోవేధనకు గురైన ఆమె ఖమ్మం పట్టణం లో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దీపావళి పండుగ సందర్భంగా నీరజ ఆమె తన తల్లిగారి ఊరైన పల్లెగూడెం వెళ్లారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాల్సి ఉండటంతో… ఆమె  ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కండక్టర్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు భారీ సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు.

మహిళా కండక్టర్  ఆత్మహత్య చేసుకోవడంతో సత్తుపల్లి డిపో దగ్గర కార్మికులు, అఖిల పక్షనాయకులు ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకుని…ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.