టీడీడీ పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంపు

టీడీడీ పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంపు

 కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామీ కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతి రోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనార్ధం విచ్చేస్తుంటారు. అలాంటి తిరుమలను ఇంకా అభివృద్ధి చెయ్యాలని టీటీడీ పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది.    టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని నిర్ణయించింది. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. అలానే  టీటీడీ పరిధిలోని కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిహిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా.. కార్పొరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పొందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా.. కార్పొరేషన్ లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం అందించేలా నిర్ణయం తీసున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితెలిపారు

పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటి ఏర్పాటు చేయడంతో పాటుగా టీటీడీ  పరిధిలోని పాఠశాల విద్యార్దులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.  టీటీడీ కళ్యాణ మండపాలలో జరిగే వివాహాలకు  డిజేలకు బదులుగా లలిత గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తాం అని పేర్కొన్నారు.

ALSO READ : ఢిల్లీ పాలకుల చేతిలోకి తెలంగాణ పోతే 50 ఏళ్లు వెనక్కిపోతది : గంగుల కమాలాకర్

 అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసేందుకు 18 కోట్లు కేటాయిచామని వెల్లడించారు. అలానే ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు, తిరుపతి లోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డుని, వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు అలానే గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.