కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ దర్శనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. మొదటి మూడు రోజులకు గాను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. చివరి ఏడు రోజుల్లో రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. మొదటి మూడు రోజుల్లో SED, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసి.. స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది టీటీడీ.
వైకుంఠ ద్వారా దర్శన రోజుల్లో తిరుపతిలో SSD టోకెన్ల జారీ నిలిపివేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది టీటీడీ. ఈ క్రమంలో వైకుంఠ దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ:
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 1వరకు మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్లు ఆన్ లైన్లో కేటాయించనున్నట్లు తెలిపింది టీటీడీ. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేయనున్నారు.
నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం:
మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలకు గాను నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in , మొబైల్ యాప్ లేదా వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది టీటీడీ. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు వెల్లడించనుంది టీటీడీ.
వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం
వాట్సాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డి[ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నంబర్ 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి.. ఆ తర్వాత ఇంగ్లీష్ లేదా తెలుగు భాషలను సెలెక్ట్ చేసుకోవాలి ( ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి.) ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న భాషలో సర్వీసెస్ విండో ప్రత్యక్షం అవుతుంది. సర్వీస్ విండోలో టెంపుల్ సర్వీసెస్ ను సెలెక్ట్ చేసుకొని.. ఆ తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ లో వైకుంఠ ద్వారా దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి.. చిరునామా, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒకసారి సబ్మిట్ చేసాక వివరాలు మార్చడానికి వీలు ఉండదు.
ఆధార్ నంబర్, పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయగానే ACKNOWLODGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్ గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది.
