తుపాకుల గూడెం గిరిజన స్కూల్ రీ ఓపెన్

తుపాకుల గూడెం గిరిజన స్కూల్ రీ ఓపెన్
  • 20 ఏండ్ల కింద మూతపడిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి సీతక్క

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని గిరిజన ప్రైమరీ స్కూల్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  సీతక్క శుక్రవారం  రీ ఓపెన్ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తుపాకులగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల 2001 –-2002 వరకు నడిచిందని, టీచర్లు బదిలీపై వెళ్లడంతో మూసివేశారని తెలిపారు. గ్రామస్తులు పాఠశాల కావాలని కోరగా.. టీ డబ్ల్యూయూపీఎస్ నుంచి ఇద్దరు టీచర్లను నియమించి ఓపెన్ చేసినట్టు చెప్పారు. పాఠశాలలో అవసరమైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని మంత్రి ఆదేశించారు. అనంతరం అంగన్ వాడీ సెంటర్ ను సందర్శించి.. కొత్తగా టాయిలెట్ కట్టించాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, ఆర్డీఓకే సత్య పాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంఈవో ఉన్నారు.