సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బీజేపీ నాయకులు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు బీజేపీ నాయకులు

అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి  నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా.. శనివారం బీజేపీ నుంచి మరో ఇద్దరు లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డిలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు.