గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి:  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం మంథనిలోనీ శివ కిరణ్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా  శ్రీపాదరావు చిత్రపతానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంథనీలో నిర్వహించిన కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ నియెజకవర్గ సన్నాహక సమావేశంలో సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని  మాట్లాడుతూ..  యువత అండగా నిలబడి.. ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాబోయే నెల రోజులపాటు ప్రతి కార్యకర్త కష్ట పడి పనిచేయాలని చెప్పారు.   వీధి కుక్కల మాదిరిగా కొందరు మొరుగుతున్నారని.. వారిని పట్టించుకోవొద్దన్నారు.  వివేక్ వెంకటస్వామి గొప్ప పారిశ్రామిక వేత్త అని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ ల సహాకారంతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంథనీలో అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని.. మా నాన శ్రీపాదరావు ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నానని మంత్రి చెప్పారు.