
జవహర్ నగర్, వెలుగు: బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడి మృతి చెందారు. జవహర్ నగర్ కార్పొరేషన్ అరుంధతినగర్ కు చెందిన యాదమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆమెను చూడడానికి బంధువులైన కౌకూర్భరత్నగర్కు చెందిన స్వాతి, గుంటూరు జిల్లా చండ్రసిపల్లికి చెందిన అంజమ్మ కుటుంబసభ్యులతో కలిసి అరుంధతి నగర్ కు వచ్చారు.
బుధవారం (జూన్ 11) మధ్యాహ్నం స్వాతి కొడుకు దుర్గాప్రసాద్ (11), అంజమ్మ కొడుకు సుబ్రహ్మణ్యం(8) బండబావి వద్ద క్వారీ గుంత వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. గుంతలో నీరు ఉండగా, ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందారు. ఈ విషయం తెలియక కుటుంబ సభ్యులు పిల్లల కోసం వెతికారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కాగా.. గురువారం సాయంత్రం క్వారీ గుంతలో ఇద్దరు డెడ్బాడీలు కనిపించాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.