
గడచిన కొన్నేళ్లుగా చైనా అనేక కుట్రలు కుతంత్రాలకు కేంద్రంగా మారిపోయింది. కరోనా వైరస్ చైనా ల్యాబ్స్ నుంచి బయటకు రావటం వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇంకా ప్రపంచ బయటపడక ముందే మరోసారి అలాంటి కుట్ర ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న చైనా పరిశోధకులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి వారు ప్రమాదకరమైన ఫంగస్ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికాలోని వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు ప్రమాదరమైన బయోలాజికల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. చైనీయులు ఫుసేరియమ్ గ్రామినీరమ్ అనే ప్రమాదకర ఫంగస్ తరలిస్తూ దొరికారు. ఇది మెుక్కజొన్న, వరి, గోధుమలు, బార్లీ వంటి పంటలను నాశనం చేస్తుందని అలాగే జంతువుల మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని అమెరికా అధికారులు వెల్లడించారు.
New... I can confirm that the FBI arrested a Chinese national within the United States who allegedly smuggled a dangerous biological pathogen into the country.
— FBI Director Kash Patel (@FBIDirectorKash) June 3, 2025
The individual, Yunqing Jian, is alleged to have smuggled a dangerous fungus called "Fusarium graminearum," which is an…
జియాన్, జున్ యాంగ్ లూ అనే ఇద్దరు గతంలో యూనివర్సిటీ ల్యాబ్ లో పనిచేయగా.. ప్రస్తుతం చైనా యూనివర్సిటీలో టీచర్లుగా పనిచేస్తున్నారు. అధికారులకు దొరికిపోయిన నిందితులు పొంతన లేని సమాదానాలు చెప్పటంతో పాటు వీసా మోసాలు, స్మగ్లింగ్ కింద కేసులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. నిందితులు మిచిగాన్ యూనివర్సిటీ క్యాంపస్ ల్యాబ్ లో ఫెడరల్ అధికారుల అనుమతి లేకుండా ప్రమాదకర ఫంగస్ పెంచుతున్నారని తేలింది. ఇలాంటి వాటికి అసలు యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : ఐపీవో క్రేజ్.. లిస్ట్ కాగానే ఎగబడ్డ ఇన్వెస్టర్స్, అప్పర్ సర్క్యూట్..
ఈ ఫంగస్ మానవుల్లో వాంతులు, లివర్ డ్యామేజ్ కి కారణమౌతుంది. ఇక పంటలకు జరిగే నష్టంతో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఎఫ్బీఐ అధికారులు పేర్కొన్నారు. 2024 జూలైలో కూడా లూ ఒక ఎర్రటి మెుక్కల పదార్థాన్ని లగేజీలో దాస్తూ తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. అయితే అధికారులు వెనక్కి అతడిని పంపించేయటంతో అతని స్నేహితురాలు జియాన్ రంగంలోకి దిగింది. ఆమె ఫోన్ ఫోరెన్సిక్ సోదాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఆమెకు ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.
ఇదంతా చూస్తుంటే అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చర్యలు అమెరికా ఆహార భద్రతతో పాటు అక్కడి ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేందిగా ఉందని యూస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే చైనా ఇలాంటి ప్రయత్నాలను ఇంకా ఎన్ని దేశాల్లో అమలు చేస్తుందో ఇప్పటి వరకు తెలియదు. ఇండియాపై కూడా ఇలాంటి దాడులకు చైనా కుట్రలు పన్నే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.