
Scoda Tubes IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. దాదాపు 5 నెలల గ్యాప్ తర్వాత వరుసగా మార్కెట్లోకి ఐపీవోలు రావటంతో ఇన్వెస్టర్లు సైతం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో జాబితా అయిన ఐపీవో గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్కోడా ట్యూబ్స్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఈ ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లలోని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏకకాలంలో లిస్ట్ అయ్యింది. అయితే కంపెనీ షేర్లు ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేయటంతో ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.140 వద్ద బీఎస్ఈలో కూడా ఇదే రేటుకు లిస్ట్ అయ్యాయి. అయితే దీంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురైనప్పటికీ లిస్టింగ్ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించటంతో 5 శాతం పెరిగి స్టాక్ ధర రూ.147కి చేరుకుంది.
కంపెనీ తన ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.220 కోట్లు సమీకరించే లక్ష్యాన్ని చేరుకుంది. ఇందుకోసం ఏకంగా కోటి 57 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను రూ.130 నుంచి రూ.140గా ప్రకటించగా.. లాట్ పరిమాణాన్ని 100 షేర్లుగా నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.14వేలు పెట్టుబడిగా బెట్టింగ్ కోసం వెచ్చించాల్సి వచ్చింది. ఐపీవో రిటైల్ పెట్టుబడిదారుల కోసం మే 28 నుంచి మే 30 వరకు అందుబాటులో ఉంచబడిన సంగతి తెలిసిందే.
Also Read : పసిడి ప్రియులకు ఉపశమనం.. హైదరాబాదులో తులం రేటెంతంటే?
మూడు రోజుల్లో ఐపీవో ఇష్యూ 57 రెట్ల కంటే ఎక్కువ సార్లు సబ్ స్క్రైబ్ చేయబడింది. దీంతో 63.70 కోట్ల షేర్లకు బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. నిపుణులు ప్రస్తుతం కంపెనీ షేర్లను దీర్ఘకాలిక వ్యూహంతో హోల్డ్ చేయాలని పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు. తాజా ఐపీవో డబ్బును కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించటానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు జనరల్ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యాపారం..
ప్రస్తుతం స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ స్టెయిన్ లెస్ స్టీల్ పైపులు, ట్యూబులు తయారీ మార్కెటింగ్ వ్యాపారంలో ఉంది. మార్కెట్లో వీరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కోసం ప్లాంట్ విస్తరణకు కంపెనీ ప్లాన్ చేసింది.