మిస్టరీ ఏంటీ : వీళ్లిద్దరూ పొలాల్లో చనిపోయి ఉన్నారు.. కారణం డ్రగ్స్ గా అనుమానం

మిస్టరీ ఏంటీ : వీళ్లిద్దరూ పొలాల్లో చనిపోయి ఉన్నారు.. కారణం డ్రగ్స్ గా అనుమానం

వరి పొలాల్లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. మృతులను కేరళలోని కోజికోడెలోని కొనుముక్కర, ఓర్కాత్తెరీ ప్రాంతాలకు చెందిన 26ఏళ్ళ అక్షయ్, 30ఏళ్ళ రణదీప్ గా గుర్తించారు పోలీసులు. వీరితో పాటు అక్కడే ఉన్న మరో యువకుడు శ్రీరాగ్ అపస్మారక స్థితిలో ఉండటంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనాస్థలంలో లభించిన ఖాళీ సిరంజిలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

డ్రగ్స్ ఓవర్ డోస్ లో తీసుకోవటమే వీరి మరణానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని తనిఖీ చేసిన డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. యువకుల మృతదేహాలను ఉదయం 8గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించారని, ఘటనాస్థలం డ్రగ్స్ బానిసలకు అడ్డా అని స్థానిక వార్డ్ మెంబర్ రతీశ్ తెలిపాడు. యువకుల అనుమానాస్పద మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ ముమ్మరం చేశారు పోలీసులు.