కలుషిత నీళ్లు తాగి ఇద్దరు చిన్నారులు మృతి

కలుషిత నీళ్లు తాగి ఇద్దరు చిన్నారులు మృతి

రాజేంద్రనగర్ ఎమ్ఎమ్ పహాడీలో కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా  సరదగా గడిపేందుకు పిల్లలంతా ఏర్పాట్లు చేస్తుండగా ఈ ఘటన జరిగిందంటున్నారు స్థానికులు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.  కలుషిత నీరు కలుస్తున్నాయని చాలా సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలు బలయ్యారంటూ ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.