జీడిమెట్ల, వెలుగు : ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్లోని ద్వారకానగర్కు చెందిన పూజిత (15) టెన్త్ క్లాస్ చదువుతోంది. పూజిత ఇంటిపక్కనే ఉండే పి.దీక్షిత (14) నైన్త్ క్లాస్ చదువుతోంది. సోమవారం పూజితను ఆమె తల్లిదండ్రులు మందలించారు.
దీంతో ఆ బాలిక మంగళవారం తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని పక్కనే ఉండే దీక్షితతో కలిసి బయటికెళ్లింది. ఇద్దరూ తిరిగిరాకపోవడంతో వారి తల్లిదండ్రులు మంగళవారం జీడిమెట్ల పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికలు వరంగల్కు వెళ్లినట్లు గుర్తించారు. ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.