పెద్దపల్లి జిల్లాలో బస్సు ఢీ కొట్టి ఇద్దరు మృతి

పెద్దపల్లి జిల్లాలో బస్సు ఢీ కొట్టి ఇద్దరు మృతి

తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆర్టీసీ బస్సులను తిప్పుతున్న టెంపరరీ డ్రైవర్లు.. యాక్సిడెంట్లు చేస్తూనే ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం…. పన్నూరు క్రాస్ రోడ్ లో బస్సు కిందపడి ఇద్దరు చనిపోయారు. మంథని డిపోకు చెందిన బస్సు పన్నూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో ఒకరు బేగంపేట గ్రామానికి చెందిన రాకేశ్ కాగా, మరొకరు ముత్తారం గ్రామవాసి… అజయ్ గా గుర్తించారు. ఈ ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, కండక్టర్ బస్సును అక్కడే వదిలి పారిపోయారు.