రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై ఇవాళ(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. స్పిరిట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారికి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో మంటలు చెలరేగి… డ్రైవర్‌, క్లీనర్‌ సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.అయితే  అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.