ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సుక్మా జిల్లాలోని కుంటా అడవుల్లో సోమవారం డీఆర్జీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.