హోలీ ఆడటానికి వెళ్లిన బాలికలపై 8 మంది యువకుల అత్యాచారం

హోలీ ఆడటానికి వెళ్లిన బాలికలపై 8 మంది యువకుల అత్యాచారం

హోలీ పండగ చేసుకుందామని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటన త్రిపురలోని ఖోవాయి జిల్లాలో చోటుచేసుకుంది. హోలీ పండగ సందర్భంగా 14,15 సంవత్సరాల వయసున్న బాలికలిద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ మీద బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లాక మరో ఆరుగురు యువకులు వీరితో కలిశారు. వీరంతా కలిసి ఖతియాబరి ఆటవీప్రాంతంలో షికారుకు వెళ్లారు. అక్కడి వెళ్లాక యువకులు బాలికల మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో భయపడ్డ యువకులు.. వారిని అక్కడే వదిలేసి పారిపోయారు. నిస్సహాయాస్థితిలో ఉన్న బాలికలు.. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. తమకు జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం ఖోవాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికల స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన 8 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు ఖోవాయి ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలికలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్యం స్థిమితంగానే ఉందని ఆయన తెలిపారు.