రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన ఇద్దరు బాలికలు

రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన ఇద్దరు బాలికలు
  • అదుపులోకి తీసుకున్న ఖాజీపేట రైల్వే పోలీసులు
  • పేరెంట్స్ వచ్చేదాకా చైల్డ్ లైన్  సూపర్ వైజర్ కు అప్పగింత

కాజీపేట, వెలుగు : ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన ఇద్దరు బాలికలను కాజీపేట రైల్వే పోలీసులు రక్షించారు.  రైల్వే పోలీసుస్టేషన్ సీఐ నరేశ్​కుమార్ తెలిపిన మేరకు.. రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన పూజా కుమారి(17), కాజల్ ఠాగూర్(17) ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి ట్రైన్ ఎక్కారు. ఈనెల 23న సోమవారం  రాజస్థాన్ పోలీసుల నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు తెలిపారు. 

బాలికలు కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని కాజీపేట రైల్వే పోలీసు(జీఆర్పీ) పోలీసులు ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లకు తెలిపారు.  టీటీఈ శివ ఇచ్చిన వివరాలతో ఇద్దరు మైనర్లను కాజీపేట రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరి తల్లిదండ్రులకు వచ్చే దాకా హనుమకొండ చైల్డ్ లైన్ సూపర్ వైజర్ ప్రభ సంరక్షణలో ఉంటారని సీఐ నరేశ్ చెప్పారు.