శ్రీ కాళహస్తిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

శ్రీ కాళహస్తిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మరో 28  రోజులు లాక్ డౌన్  పొడిగించినట్లు ప్రకటించారు జిల్లా కలెక్టర్  భరత్ నారాయణ గుప్తా. శ్రీకాళహస్తి మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడికి చేరుకున్నా జిల్లా కలెక్టర్.. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో మొట్ట మొదటిసారిగా శ్రీకాళహస్తి పట్టణంలో పాజిటివ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.అయితే ఆయన వైద్యం తర్వాత రికవరీ అయ్యి  డిశ్చార్జ్  కూడా కావడం జరిగిందన్నారు. ఇవాళ కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించిన వారిని క్వారంటైన్ కు తరలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి  మొదట చేసిన వైద్య పరిక్షల్లో నెగటివ్ రావడం, ఆ తర్వాత పాజిటివ్ రావడంపై అధికారులతో చర్చించామన్నారు కలెక్టర్  భరత్ నారాయణ గుప్తా.