వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి

వేములవాడ రూరల్/ నకిరేకల్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిహార్​కు చెందిన కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ చనిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్​కు చెందిన కూలీ శంకర్ సదా (33) పని చేస్తున్నాడు. శుక్రవారం ఆయనకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేములవాడ రూరల్ ఎస్​ఐ మారుతి తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండ లం అడ్లూరు గ్రామానికి  చెందిన బోడ ఆశ్రిత నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్నది. ఇటీవల బంధువు ఫంక్షన్​కు వెళ్లి వడదెబ్బకు గురైంది. శుక్రవారం తీవ్ర అస్వస్థతో మృతి చెందింది. తన భార్య ఫంక్షన్​కు వెళ్లడంతో వడదెబ్బ తగిలిందని.. తీవ్ర అస్వస్థతతో చనిపోయిందని ఆశ్రిత భర్త పేర్కొన్నారు.