
- పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్కు చెందిన జోగుల నరేశ్కుమార్, వనస్థలిపురానికి చెందిన బలగోని వెంకటేశ్, ఖమ్మం జిల్లాకు చెందిన కోర్లపాటి వంశీ, పెద్దపల్లి జిల్లా కేసీఆర్ కాలనీకి చెందిన పులిపాక ఓంకార్ కలిసి గత బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్కు పాల్పడ్డారు. 19 చెక్కులకు సంబంధించిన సొమ్మును ఫోర్జరీ పత్రాలతో వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు.
విశ్వసనీయ సమాచారంతో మంగళవారం జూబ్లీహిల్స్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. మధుసూదన్ తన సిబ్బంది సహాయంతో నరేశ్, వెంకటేశ్ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. జోగుల నరేశ్గతంలో ఓ మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేయగా, అతడి నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం
గాలిస్తున్నారు.