చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి.. మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి.. మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మరో వ్యక్తి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108లో తొర్రూరులోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. దంతలపల్లి మండల కేంద్రంలో శనివారం (జులై 1న) తెల్లవారుజామున వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

చనిపోయిన వారిలో సమీర్, డ్రైవర్ హలీం ఉన్నట్లు గుర్తించారు. మృతులు నిర్మల్ జిల్లాకు చెందిన వారు. నిర్మల్ నుండి ఖమ్మం వెళ్తుండగా కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొంది. మృతుల దగ్గర ఉన్న 4 లక్షల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లను తొర్రూరు108 సిబ్బంది డ్యాగ ఉదయ్ కుమార్, ఏనుగంటి రమేష్..  పోలీసులకు అందజేసి, మానవత్వం చాటుకున్నారు. హలీం, శామీర్ డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తొర్రూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు.