ఉద్ధవ్ థాక్రే మామ పతంకర్ (76) మృతి

ఉద్ధవ్ థాక్రే మామ పతంకర్ (76) మృతి

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మామ మాధవ్ పతంకర్ (76) సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పతంకర్ మృతి చెందిన విషయాన్ని సదరు ఆస్పత్రికి చెందిన అధికారితోపాటు శివసేన పార్టీ సీనియర్ లీడర్ ఒకరు కన్ఫమ్ చేశారు. పతంకర్ కూతురు రశ్మీని థాక్రే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం శివ సేనకు చెందిన సామ్నా పత్రికకు రశ్మీ ఎడిటర్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.