సీఎం రేవంత్ రెడ్డి.. అక్టోబర్ నుండి సింహం లాగా పనిచేస్తారు

సీఎం రేవంత్ రెడ్డి.. అక్టోబర్ నుండి సింహం లాగా పనిచేస్తారు

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి.. అక్టోబర్ నుండి సింహం లాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రొది నామసంవత్సరం లో కూడా అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా రాజయోగం వుందని అయన తెలిపారు. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిలుకూరి శ్రీనివాస మూర్తి పంఛాంగ పఠనం చేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్నారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుందన్నారు.అధికార పార్టీ కొత్త చట్టాలను తెస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టులో అన్యుహ మార్పులు సంభవిస్తాయని చెప్పారు. కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమవుతారని... ప్రధానమంత్రి పదవిలో మార్పులు సంభవిస్తాయన్నారు. రాజకీయ నేతలు కూడా శిక్షార్హులు అవుతారని చిలుకూరి శ్రీనివాస మూర్తి తెలిపారు.