
- అట్టహాసంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర
- తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ క్యూ
- సందడిగా ఆలయ పరిసరాలు
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- సాయంత్రం ఫలహారం బండి ఊరేగింపు
- రేపు రంగం, పోతరాజుల గావు
- 2,500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం (జూలై13) అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. పూజారులు తెల్లవారుజామునే అమ్మవారికి మహా మంగళ హారతి ఇచ్చారు. సీఎం రేవం తిరెడ్డి బోనాల జాతరకు హాజరై ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదా శీర్వచనాలిచ్చాడు. ఆయన వెంట మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సల హాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రులందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్రెడ్డి ప్రార్థం చారు.
అంతకుముందు అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకుని. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తొలి బోనం-సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిం చారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మ వారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు రీ రోడ్, బాట షోరూం నుంచి ప్రవేశం కల్పిం చారు. ఇవాళ సాయంత్రం ఫలహారం బండి ఊరేగింపు, రేపు 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది.
2,500 మంది పోలీసులతో బందోబస్తు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సుమారు 2,500. మంచి పోలీసులు బందోబస్తు చేస్తున్నాడు. అం ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గా పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.