భర్త మరణాన్ని ..తట్టుకోలేక భార్య మృతి..    జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో ఘటన

భర్త మరణాన్ని ..తట్టుకోలేక భార్య మృతి..    జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో ఘటన

పెగడపల్లి, వెలుగు : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య చనిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

పెగడపల్లి అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కమిటీ వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ సత్తిరెడ్డి తండ్రి, మద్దులపల్లి గ్రామానికి చెందిన సురకంటి చుక్కారెడ్డి (85) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం 6 గంటల టైంలో అతడు చనిపోయాడు.

ఈ విషయాన్ని తట్టుకోలేని చుక్కారెడ్డి భార్య శంకరమ్మ (80) రాత్రి 11.30 గంటల టైంలో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. నాలుగు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.