హైదరాబాద్, వెలుగు: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఐటా) నేషనల్ సిరీస్ అండర్14 టోర్నమెంట్లో హైదరాబాద్ యంగ్ ప్రణీత్ రెడ్డి సత్తా చాటాడు. సిటీలోని ఆష్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్లో టైటిల్ గెలిచి సింగిల్స్లో రన్నరప్గా నిలిచాడు.
డబుల్స్ ఫైనల్లో ప్రణీత్–మీర్ ఫజల్ (తమిళనాడు) 6–2, 6–1తో ఇషాన్ (ఏపీ)–ధ్రువ హెగ్డే (తెలంగాణ) జంటపై గెలిచి చాంపియన్గా నిలిచాడు. సింగిల్స్ ఫైనల్లో ప్రణీత్ 3–6, 1–6తో టాప్ సీడ్ మీర్ ఫజల్ అలీ (తమిళనాడు) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు.