వనపర్తి, వెలుగు: సర్కారు గురుకుల ఉపాధ్యాయ నోటిఫికేషన్ వేస్తుందని ఎదురు చూసి చూసి.. మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘అమ్మా నాన్న.. మీరు నన్ను అపురూపంగా చూసుకున్నరు. నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూస్కుందామనుకున్న. కానీ ఏ ఉద్యోగం సాధించలేకపోయిన. గురుకుల ఉపాధ్యాయ నోటిఫికేషన్ కోసం ఎంతో ఎదురుచూసిన. శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్న. ఏం జాబ్ చేస్తున్నావని ఫ్రెండ్స్, బంధువులు అడిగితే సమాధానం చెప్పలేక పోతున్న. నిరుద్యోగిగా సమాజంలోబతకలేక పోతున్న’ అని సూసైడ్ నోట్ రాసి సూసైడ్ నోట్ రాసి ఇంటో ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. తాడిపర్తి గ్రామానికి చెందిన తోకల రాములు, వెంకటమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు పదేళ్లక్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. తల్లిదండ్రులు హైదరాబాద్లో కూలి పనులు చేసేవాళ్లు. కొండల్ ఊర్లో ఉంటూ ఎంకాం, బీఈడీ చేశాడు. గురుకుల టీచర్ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాన్ని తగ్గించాలనుకున్నాడు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూశాడు. సర్కారు నోటిఫికేషన్ వేయలేదని మనస్తాపం చెందాడు. గురువారం ఇంట్లోంచి కొండల్ బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు తీసి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. రాష్ట్రంలో టీచర్ జాబ్ల కోసం వేలాదపెళ్లిచేసుకోమన్నందుకు
ప్రియురాలిని చంపిండుి మంది యువకులు ఎదురు చూస్తున్నారు.