ఓయూకు రూ.1,000 కోట్లు రిలీజ్ చేయాలి..నిరుద్యోగ జేఏసీ డిమాండ్ 

ఓయూకు రూ.1,000 కోట్లు రిలీజ్ చేయాలి..నిరుద్యోగ జేఏసీ డిమాండ్ 

ఉప్పల్, వెలుగు: ఓయూకు సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.1,000 కోట్లు వెంటనే రిలీజ్​చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్​ చేసింది. ఓయూ ఆర్ట్స్​కాలేజీలో శనివారం రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్​రామ్​షెఫర్డ్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్​ఆర్ఎల్​ మూర్తి తదితరులు మాట్లాడారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఓయూలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి, రాజీవ్​యువ వికాసం ఫండ్స్​విడుదల చేయాలని కోరారు. ఆయా సమస్యలపై ఈ నెల 7న ఓయూలో భారీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.