కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే అనుకోని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అ పార్టీ అత్యధికంగా 18 వార్డులను గెలుచుకోంది. ఎంఐఎం సహకారంతో టీఆర్ఎస్ ఈ వార్డులను గెలుచుకుందిద. సంగారెడ్డిలో మొత్తం వార్డులు 38 ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ 18, కాంగ్రెస్ 14, ఎంఐఎం 01, బీజేపీ 02, ఇండిపెండెంట్లు 03 స్థానాలను దక్కించుకుంది.