భారత్​ జీ20 ప్రెసిడెన్సీ .. చరిత్రాత్మక విజయం : అమిత్ షా

భారత్​ జీ20 ప్రెసిడెన్సీ .. చరిత్రాత్మక విజయం : అమిత్ షా
  •  
  • భారత్​ జీ20 ప్రెసిడెన్సీ .. చరిత్రాత్మక విజయం
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ : భారత్​ జీ20 ప్రెసిడెన్సీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని అమిత్​షా అభినందించారు. సమిట్ సక్సెస్​ దేశంలోని ప్రతి పౌరుడిపైనా చెరగని ముద్ర వేసిందన్నారు.

సాంస్కృతిక విలువల్లో భారత్​ ఔనత్యం సాటిలేనిదని, మోదీ విజన్.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తును లీడర్లు విశ్వసిస్తున్నట్లు షా తెలిపారు. ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్​ షా ట్వీట్​ చేశారు.