- భారత్ జీ20 ప్రెసిడెన్సీ .. చరిత్రాత్మక విజయం
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : భారత్ జీ20 ప్రెసిడెన్సీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని అమిత్షా అభినందించారు. సమిట్ సక్సెస్ దేశంలోని ప్రతి పౌరుడిపైనా చెరగని ముద్ర వేసిందన్నారు.
సాంస్కృతిక విలువల్లో భారత్ ఔనత్యం సాటిలేనిదని, మోదీ విజన్.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తును లీడర్లు విశ్వసిస్తున్నట్లు షా తెలిపారు. ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు.