అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు 3 రోజుల పోలీస్ కస్టడీ

అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు 3 రోజుల పోలీస్ కస్టడీ

లఖీంపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఆశీష్ మిశ్రాను ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 12గంటల పాటు ప్రశ్నల వర్షం తర్వాత మిశ్రాను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు మేజిస్ట్రేట్. అయితే ఆశీష్ మిశ్రాను తమ కస్టడీకి ఇవ్వాలని శనివారం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే ఆశీశ్ మిశ్రాను 3 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది.